నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా అఖండ, ఈ సినిమాలో ముద్దు గుమ్మలు ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుండి జనాల్లో ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి, దానికి ప్రధాన కారణం ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ, అఖండ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హైడ్రిక్ సినిమా కోసం ఎంతో కాలం నుండి బాలకృష్ణ అభిమానులతోపాటు  మామూలు జనం కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను, టీజర్, ట్రైలర్, పాటలను చిత్రం బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

 అయితే ప్రస్తుతం ఈ సినిమా పనులు అన్నీ దాదాపుగా ముగియడం తో ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు, ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ ల జోరు పెంచింది. ఇప్పటికే నవంబర్ 26  వ తేదీన  భారీ ఎత్తున అఖండ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఈ సినిమా గురించి ఈ నిర్మాత తెలియజేస్తూ సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల తర్వాత నుంచి సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని ఆయన తెలియజేశాడు. ఇలా ఈ చిత్ర నిర్మాత చెప్పడంతో ఈ సినిమాపై జనాల్లో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: