నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న సినిమా అఖండ, ఈ సినిమాకు బాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్ర లో కనిపించబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ రైతు గా, అఘోరా గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను, టీజర్, ట్రైలర్, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనా ల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి, ఇలా ఇప్పటికే జనాలలో మంచి అంచనాలను కలిగి ఉన్న ఈ సినిమా ను డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో మిత్ర బృందం భా రీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

సినిమా విడుదల తేది దగ్గర పడటం తో అఖండ చిత్ర బృందం నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ను కూడా ఏర్పాటు చేసింది, ఇది ఇలా ఉంటే తాజాగా అఖండ సినిమా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిసినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయా లను తెలియజేశారు, ఈ చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదల తేదీ ని డిసైడ్ చేసింది డిస్ట్రిబ్యూటర్ లే అని, డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేస్తే మంచిది అని వారు చెప్పడంతో అలాగే ఈ సినిమాను థియేటర్ లోకి తీసుకు వెళ్తున్నాము అని తెలియజేశారు. మరి డిసెంబర్ 2 వ తేదీన విడుదల కాబోతున్న అఖండ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: