దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎస్.జె. సూర్య ఆ తర్వాత నటుడిగా మారి సినిమాలు చేశారని తెలుస్తుంది.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారని తెలుస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సూర్య ఖుషి సినిమా చేసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారో అందరికి బాగా తెలుసు.అలాగే మహేష్ బాబూతో నాని సినిమా చేశారని తెలిసిన విషయమే.. ఆతర్వాత మహేష్ నటించిన స్పైడర్ సినిమాలో విలన్ గా నటించి అందరిని బాగా భయపెట్టారట ఎస్.జె. సూర్య. తాజాగా సూర్య నటించిన తమిళ్ సినిమా అయిన ‘మానాడు’ తెలుగులో ది లూప్ పేరుతో విడుదలైందని తెలుస్తుంది.. ఈ సందర్భంగా సూర్య ఓ ఇంట్రవ్యూలో పాల్గొన్నారని సమాచారం ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ -మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారని తెలుస్తుంది.ఆయన వారిద్దరిలో తేడా ఏంటో చెప్పుకొచ్చారని తెలుస్తుంది.

దర్శకుడిగా నేను పవన్ కల్యాణ్ తో ‘ఖుషీ’ మరియు మహేశ్ తో ‘నాని’ సినిమాలు చేశానని చెప్పుకొచ్చారాట ఆ సమయంలో వారిని చాలా దగ్గరగా చూసానని చెప్పారట.పవన్ కళ్యాణ్ దేవుడు చేసిన సింగిల్ పీస్ అని ఆయన తన మనసుకు నచ్చింది వెంటనే చేసేస్తాడని చెప్పుకొచ్చాడటా ఏది ఉన్న నిర్మొహమాటంగా చెప్పేస్తారని సినిమా చేస్తా అంటే చేస్తానని లేదంటే చేయను అని చెప్పేస్తారని చెప్పుకొచ్చాడటా. పవన్ ఏదైనా అనుకుంటే వెంటనే అది జరిగిపోవాలని చెప్పారట.ఇక మహేష్ విషయానికొస్తే ఆయన చాలా కూల్ అని చెప్పారట.మహేష్ తన మనసుకు నచ్చిన పని చేయాలంటే కొంత ఆలోచిస్తారని చెప్పుకొచ్చారట . ఇదే నేను ఆ ఇద్దరిలో కనుకుంది అని చెప్పుకొచ్చారట సూర్య. అలాగే ఈ ఇద్దరి స్వభావాన్ని బట్టి పవన్‌ను అజిత్ తోమహేష్‌ను దళపతి విజయ్ తోపోల్చుతానని చెప్పారట. ఎందుకంటే ఈ నలుగురితో నేను కలిసి పనిచేశాను అని అన్నారట ఎస్.జె. సూర్య.

మరింత సమాచారం తెలుసుకోండి: