తాజాగా తెలుగు సినిమా కొరియోగ్రాఫర్ అయిన శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి చాలా దీన స్థితిలో ఉన్నది. ఆయనకి కరోనా చూపడంతో చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాదులో AIG ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు.అయన సహాయం కోసం వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నటుడైన సోను సూద్ కూడా తనకు తోచిన విధంగా సహాయాన్ని ప్రకటించారు. తాజాగా హీరో ధనుష్ కూడా తన గొప్ప మనసుతో సహాయాన్ని ప్రకటించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

శివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తనకు 10 లక్షల రూపాయలను ఖర్చు కోసం ఇచ్చారు. ఈ విషయాన్ని ఎటువంటి ఆర్భాటం లేకుండా చేసి చూపించాడు హీరో ధనుష్. ఈ విషయాన్ని శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులను కూడా తెలియ చేయ వద్దని చెప్పినట్లుగా సమాచారం. కానీ ఈ విషయం ఎలా బయటికి వచ్చిందో తెలియదు కానీ బాగా వైరల్ గా మారుతోంది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ధనుష్ ను పొగడ్తల వర్షం కురిపించారు.

మన తెలుగు హీరోలు కూడా ఈ కొరియోగ్రాఫర్ కు సహాయం చేస్తే బాగుండేదని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంపై మన తెలుగు హీరోలు ఎవరు స్పందించకపోవడంతో నెటిజెన్స్ కాస్త అసంతృప్తి చెందుతున్నారు. శివ శంకర్ మాస్టర్ తను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో తెలుగు తమిళ భాషల్లో కూడా కొరియోగ్రాఫర్ గా చేయడం విశేషం.

ఈయన కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఈయన పలు షోలకు కూడా జడ్జి గా వ్యవహరించన, షోలు టిఆర్పి రేటింగ్ లో మొదటి స్థానం లో ఉండేవి.కాని దురదృష్టవశాత్తు ఏపీ కొరియోగ్రాఫర్ కరోనా బారిన పడడంతో ఏ ఒక్కరు తనకు సహాయం చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: