ఇండస్ట్రీ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చే వారందరూ తాము దర్శకత్వం వహించే మొదటి సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటూ ఇండస్ట్రీ లోకి వస్తారు. అయితే అలా వచ్చిన వారిలో కొంత మందికి మొదటి సినిమా పరాజయం పాలైతే, మరి కొంత మంది మాత్రం తాము దర్శకత్వం వహించే మొదటి సినిమానే అనుకున్న రేంజ్ లో తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర మంచి విషయాలను అందుకుంటారు. అలా మొదటి సినిమా తోనే బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న దర్శకులలో సుజిత్ ఒకరు.షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ని మొదలు పెట్టిన దర్శకుడు సుజిత్, శర్వానంద్ హీరోగా యు వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఈ సినిమాను ఈ దర్శకుడు తీర్చిదిద్దిన విధానం, ప్రేక్షకులకు అర్థం అయ్యేలా సినిమాను తెర కెక్కించిన విధానానికి ఇటు ప్రేక్షకులతో పాటు అటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి, ఇలా మొదటి సినిమా తోనే అతనికి సిని మా పై ఉన్న పట్టు ను కూడా తెలియజేసిన ఈ దర్శకుడు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా డార్లింగ్ ప్రభాస్ తో తన తదుపరి సినిమా చేసే అవకాశాన్ని కూడా దక్కించు కున్నాడు. కేవలం ఒక్క సినిమా తోనే పాన్ ఇండియా క్రేజ్ వున్న ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని ఈ దర్శకు డు అందుకున్నాడు. ఆ తర్వాత సుజిత్, ప్రభాస్ హీరోగా సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్ లో ఆకట్టు కోలేక పోయింది. ఏదేమైనప్పటికీ రన్ రాజా రన్ సినిమా తో మాత్రం సుజిత్ బాక్సాఫీస్ దగ్గర అదిరి పోయే విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: