రంగుల ప్రపంచం సినీరంగంలో ఎప్పుడు ఎవరు హైలెట్ అవుతారో, అలాగే ఎవరు డౌన్ అవుతారో అస్సలు ఊహించలేం. సరైన కంటెంట్ దానికి తోడు కాస్త అదృష్టం కలిసి రావాలే కానీ ఇండస్ట్రీలో చక్రం తిప్పేయొచ్చు. అందుకే అంటుంటారు అందరూ ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం అని, అది సినీ పరిశ్రమకి చాలా దగ్గర బంధువు మరి. కాగా ఇలా ఒక్క సినిమాతో సెన్సేషన్ సృష్టించి అందరి దృష్టిని తమపై తిప్పుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఆలాంటి వారు ఎవరయ్యా అంటే వెంటనే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు గుర్తు రావాల్సిందే. ఈయన పేరుకి కన్నడ దర్శకుడే అయినా 'కేజీఎఫ్' చిత్రం తర్వాత టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు.

తెలుగు స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచారు. కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా కేజిఎఫ్ చిత్రాన్ని కన్నడలో తెరకెక్కించారు ఈ దర్శకుడు. ఈ సినిమాని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్ వంటి ఇతర భాషల్లోనూ ఒకేసారి విడుదల చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిచయం లేని దర్శకుడు, అలాగే హీరో యశ్ కూడా ఇక్కడ వారికి పెద్దగా తెలియదు. అలా ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా రిలీజైన ఈ చిత్రం సెన్సేషనల్ సక్సెస్ ను అందుకుంది. రికార్డులను తిరగరాసిన చిత్రంగా ప్రఖ్యాతి పొందింది. బాక్సాఫీస్ ను గడ గడ లాడించిన ఈ చిత్రంతో హీరో యశ్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.

ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం వేరే లెవల్లో ఉంది. హాలీవుడ్ డైరెక్టర్ అంత క్రేజ్ వచ్చింది ఈ సినిమాతో. ఆ విధంగా ఈ  ఒక్క సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.  ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ ను రూపుదిద్దే పనిలో ఉన్నారు ప్రశాంత్. ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్టింగ్ ఉండబోతున్న విషయం తెలిసిందే. అలాగే డార్లింగ్ ప్రభాస్ తో 'సలార్' పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.  ఈ చిత్రం అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ చిత్రంతో సృష్టించిన సునామీతో తెలుగులో అగ్ర హీరోలతో వరుస ప్రాజెక్టు లు చేస్తూ బిజీ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: