ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలోకి పక్క భాష నటులు ఎక్కువుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఒక్కపుడు హీరోయిన్ లు,హీరోలు మాత్రమే మన సినిమాలో కనిపించేవారు. కానీ ఇప్పుడు కమెడియన్స్ దగ్గర నుండి హీరోయిన్ చెల్లెలుగా, హీరో హీరోయిన్లకు తల్లిగా తండ్రీగా నటించేవాళ్లు కూడా ఎక్కువైపోయారు. ఇక తెర పై కొత్త మొహాలు కనపడుతుండడంతో వాళ్ల గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాని సినిమాలో ఆయనకు తల్లిగా నటించిన అర్జునమ్మ గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రీసెంట్ గా ఎన్నో అవాంతరాల మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన నాని హీరోగా  నటించిన సినిమా టక్ జగదీష్.  ఈ సినిమాని అమెజాన్ ఓటీటీ లో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ స్పందించుకోలేకపోయినా పాజిటివ్ టాక్ ను మాత్రం దక్కించుకుంది. ఇది వరకే  వీళ్ల కాంబినేషన్ లో  వచ్చిన నిన్ను కోరి సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈ టక్ జగదీష్ సినిమా మాత్రం అంత హిట్ అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో నటించిన నటీనటులకు మాత్రం యాక్టింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి.  ఈ సినిమా లో ఐశ్వర్య రాజేష్ , రోహిణి , రీతు వర్మ , జగపతిబాబు వంటి స్టార్స్ కూడా నటించడం గమనార్హం.

 కానీ ఈ సినిమాలో నానికి తల్లిగా నటించిన ఆమె బాగా హైలెట్ అయ్యింది. అర్జునమ్మ పాత్రలో అదరకొట్టేసింది. ఇక ఆమె అసలు పేరు మాల పార్వతి. ఈమె  తిరువనంతపురంలో జన్మించారు. ఈమె ముందు యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఏషియానెట్ లో ప్రసారమైన ఒక ప్రోగ్రాం ద్వారా  యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన ఈ అర్జునమ్మ.. 2007లో మలయాళం సినిమా టైం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యింది. ఇప్పటి వరకు ఈమె 100కు పైగా సినిమాల్లో నటించారు. చాలా వరకు ఈమె మలయాళం, తమిళ సినిమాల్లోనే నటించారు. కెరీర్ ఆరంభంలో కొన్ని షార్ట్ ఫిలిం స్ కూడా చేసిన ఈమె..  సతీషన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.  ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మరో రెండు సినిమాలకు గ్రీన సిగ్నల్ ఇచ్చిన్నట్లు  తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: