అదే టీం తో ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మొదటి భాగం అంతా స్లో గా నడిచినా రెండవ భాగంలో మంచి ట్విస్ట్ ను పెట్టి చివరి వరకు ప్రేక్షకుడిని థ్రిల్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. దీనితో ఈ సినిమాకు కూడా సీక్వెల్ చేయమని ప్రేక్షకుల నుండి డిమాండ్ పెరుగుతోంది. సినిమాను ముగించిన తీరు కూడా ఇంకో పార్ట్ ను తెరకెక్కించడానికి స్కోప్ ను కలుగచేసింది. కాబట్టి ఈ సినిమా సీక్వెల్ గా 'దృశ్యం 3' అని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
అయితే సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి సీక్వెల్ ఉంటే జీతూ జోసెఫ్ ను కాకుండా తెలుగు డైరెక్టర్ ను ఎంచుకునే దిశగా సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.