టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారిలో చిరు, వెంకీ, బాలయ్య మరియు నాగార్జున లు ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు టచ్ లోనే ఉన్నారు. అందరి కన్నా కొంచెం ఫాస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ ఊపుమీదున్నది ఒక వెంకటేష్ ఒక్కరే. ఈ సంవత్సరం నారప్ప లాంటి తమిళ్ మూవీ రీమేక్ ను తెలుగు లో చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు వెంకీ. ఇప్పటికే 'ఎఫ్ 2' మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో వెంకీ మరియు వరుణ్ బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో గతంలో వచ్చిన మలయాళ మూవీ 'దృశ్యం' రీమేక్ ను తెలుగులో చేసి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ గా నిన్న అమెజాన్ ప్రైమ్ లో 'దృశ్యం 2' ను విడుదల చేశారు.

అదే టీం తో ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మొదటి భాగం అంతా స్లో గా నడిచినా రెండవ భాగంలో మంచి ట్విస్ట్ ను పెట్టి చివరి వరకు ప్రేక్షకుడిని థ్రిల్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. దీనితో ఈ సినిమాకు కూడా సీక్వెల్ చేయమని ప్రేక్షకుల నుండి డిమాండ్ పెరుగుతోంది. సినిమాను ముగించిన తీరు కూడా ఇంకో పార్ట్ ను తెరకెక్కించడానికి స్కోప్ ను కలుగచేసింది. కాబట్టి ఈ సినిమా సీక్వెల్ గా 'దృశ్యం 3' అని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

అయితే సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సారి సీక్వెల్ ఉంటే జీతూ జోసెఫ్ ను కాకుండా తెలుగు డైరెక్టర్ ను ఎంచుకునే దిశగా సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: