సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గీత గోవిందం ఫెమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది, ఇప్పటికే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రం బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, సినిమాపై ఉన్న అంచనాలను కూడా పెంచేశాయి, ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ను చాలా కొత్త లుక్ లో దర్శకుడు పరశురామ్ చూపించబోతున్నారు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది, మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా లో  లావణ్య త్రిపాటి  ని  హీరోయిన్ గా చిత్ర బృందం ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ వార్తపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాటి 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది, ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ తెలుగు నాట మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్ గా ఎదిగింది, తాజాగా కొన్ని రోజుల క్రితం సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాతో లావణ్య త్రిపాటి ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: