ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడు గా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత కూడా వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. తను చేసే ప్రతి సినిమాతో హిట్ కొడుతున్నాడు అనిల్ రావిపూడి. ఈయన చేసే ప్రతి సినిమాలో కామెడీ ఉండడం అయితే అదే కామెడీ తో తన సినిమాలు హిట్ కావడం విశేషం. ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అనిల్ రావిపూడి. మంచి మంచి సినిమాలను తీస్తూ ప్రేక్షకుల అంచనాలను దాటేసింది విధంగా సినిమాలు ఇస్తూ హిట్ లను అందుకుంటున్నా డు అనిల్.

 అనిల్ రావిపూడి ఈ మధ్య కాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం తను ఎఫ్ మూడు సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. వెంకటేష్ వరుణ్ తేజ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది అయితే ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా నందమూరి నటసింహం బాలకృష్ణ తో కూడా కలిసి అనిల్ రావిపూడి ఒక సినిమా  ఉన్నట్లుగా తెలుస్తోంది.

 అనిల్ రావిపూడి వీరితోనే కాకుండా మెగా హీరోలతో కలిసి కూడా సినిమాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటన్నిటి పైన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. చిరంజీవి గారి సినిమా టాక్స్ లో ఉందని, అలాగే పవన్ కళ్యాణ్ గారి తో సినిమా కూడా టాక్స్ లోనే ఉంది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. టాక్స్ లో ఉన్న ఒకే ఒక్క సినిమా ఓకే అయినా కూడా అనిల్ రావిపూడి మెగా క్యాంప్ లో చేరినట్టే. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: