పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనున్  కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా,  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను ఇస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్ లను, టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమా పై ఉన్న అంచనాలు కూడా పెంచేశాయి, ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దగ్గుపాటి రానా సరసన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది.

 ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణంగా కనిపించబోతున్నారు. శర వేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఇప్పటికే పోస్టర్, టీజర్, పాటలతో ప్రమోషన్ ల జోరు పెంచిన భీమ్లా నాయక్ చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను కూడా జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 14 వ తేదీన కాని, 15 వ తేదీన గాని భీమ్లా నాయక్ టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు ఈ వార్త గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: