జననీ ప్రియభారత జననీ అంటూ సాగే ఈ గీతం మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిన సందర్భంగా జరుగుతున్న అమృత ఉత్సవానికి ఇది నివాళిలా అనిపిస్తోంది. ఎన్టీఆర్, రామ్చరణ్ తో పాటు ఆలియా భట్ సైతం ఈ పాటలో కనిపించారు. అదేవిధంగా అజయ్దేవగణ్, ఆయన భార్యగా శ్రియా మధ్య ఆసక్తికర సంభాషణలకు కూడా చోటు ఇచ్చారు రాజమౌళి. స్టార్స్ దగ్గర నుంచి బాలనటులు, జూనియర్ ఆర్టీస్టులు సైతం ఇందులోని ప్రతి సన్నివేశానికి ప్రాణం పెట్టి చేసారని ఈ పాట చిత్రీకరణ చూస్తే ఇట్టే అర్థమవుతోంది.
'జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆత్మలాంటిదని ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు. ఈ పాట కోసం పెద్దన్న కీరవాణి దాదాపు రెండు నెలలు శ్రమించారని వివరించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ రాయడమే కాకుండా.. ఈ పాటను ఒక్కరోజు ముందుగా గురువారం హైదరాబాద్లో విలేకరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. రాజమౌళి ‘‘డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేస్తామని చెప్పారు. వరుసగా ప్రీ రిలీజ్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నాం అని.. ‘జనని..’ పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయని, ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే కనిపించదో.. అలానే సాఫ్ట్ ఎమోషన్ కనిపించదు అన్నారు. కానీ సినిమా సోల్ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది అని వివరించారు రాజమౌళి. పాటలో పేర్కొన్నట్టుగా అరినాశ గర్జనములై… ఈ సినిమా అఖండ విజయం సాధించడం ఖాయమని ఈ పాట చూస్తే అర్థమవుతోంది. ఇంతకు ముందు వచ్చిన ‘నాటు నాటు’ సాంగ్ తో కుర్రకారుని కిక్కెక్కించిన రాజమౌళి, ‘జననీ’ గీతంతో ప్రతి ఒక్కరి హృదయాలను ఆర్ద్రతతో నింపేసాడు.