ఇక అలాంటి తారను రిప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు. ఆమె లా క్రేజ్ ఎవరు సంపాదించుకోలేరు అనే టైంలో వచ్చింది ఓ ఆటో బాంబ్. ఆమె పేరే "మమత కులకర్ణి". దివ్యభారతి చనిపోయిన తరువాత అచ్చం దివ్యభారతి పోలికలతో ఉన్నటువంటి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మమత. దివ్య భారతి లానే ఆమె కూడా ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి.. మనల్ని మెప్పించి..దివ్యభారతి అభిమానులను సైతం మైమరపించింది. కెరీర్ పీక్స్ టైంలో ఉండగానే టాప్ లెస్ ఫోటో షూట్ లో పాల్గోని హాట్ టాపిక్ గా నిలిచింది. అప్పట్లో ఈమె చేసిన ఈ పనికి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఇక ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వివాదాలు కూడా చెలరేగడంతో ఇక చేసేదేమి లేక భారీ జరిమానను కట్టిందట.
అంతేకాదు..2016 సంవత్సరంలో ఓ సినిమా విషయంలో పెద్ద వివాదం చెలరేగడంతో.. మమతా కులకర్ణి అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా మమతా కులకర్ణి అందమైన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో మరోసారి ఈమె వార్తల్లో నిలిచారు. మమతా కులకర్ణి ప్రేమశిఖరం మూవీ ద్వారానే తెలుగు తెరకు పరిచయమవ్వడం విశేషం. ఎందుకంటే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా దివ్యభారతి నటించాల్సి ఉంది. కానీ ఆమె షూటింగ్ మధ్యలోనే చనిపోవడంతో అదే పోలికలతో ఉన్న..మమతా కులకర్ణి ని హీరోయిన్ తీసుకొని ఈ సినిమాను పూర్తి చేశారు. ఇక ఈ సినిమాలోని కొన్ని సీన్లు చూస్తే నిజంగా దివ్య భారతినే చేసిందేమో అనిపించేలా మమతా కులకర్ణి యాక్ట్ చేసింది.