టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించిన వాళ్ళు ఇప్పుడు తమ పంథా మార్చుకుని విలన్గా కూడా నటించడానికి రెడీ అవుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై వారిని చూస్తే నవ్వు వచ్చేది. వాళ్లు ఏం మాట్లాడకపోయినా ముఖం చూస్తేనే కడుపుబ్బా నవ్వేవాళ్ళు ప్రేక్షకులు. తమ కామెడీతో తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ గా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కొంతమంది కమెడియన్స్. కానీ ఇప్పుడు ఆ కమెడియన్లను చూస్తుంటే భయమేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నవ్వించడం మానేసి తమ విలనిజంతో భయపెట్టడం మొదలుపెట్టారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సునీల్.

 సునీల్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు కూడా. తన సెకండ్ ఇన్నింగ్స్ లో రొటీన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నించాడు. ఇన్నాళ్లూ తనలోని కమెడియన్ ని మాత్రమే చూసిన ప్రేక్షకులకు ఇప్పుడు తనలోని విలన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే సునీల్ నటించిన కలర్ ఫోటో, డిస్కో రాజా సినిమాల్లో సునీల్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు ఏకంగా పుష్ప సినిమాలో భయంకరమైన మంగళం శ్రీను అనే నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర తన కెరీర్ లోనే నిలిచిపోతుందని అంటున్నాడు సునీల్.

ఇక ఇదిలా ఉంటే సత్యం సినిమాతో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేష్ కూడా ఈ మధ్య కొన్ని సినిమాలలో ప్రతినాయకుడుగా కనిపిస్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన దృశ్యం 2 సినిమాలో సత్యం రాజేష్ క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమాలో ఇతనిది పోలీస్ ఆఫీసర్ పాత్ర అయినా.. ఫస్టాఫ్ మొత్తం భార్యను హింసించి తాగుబోతు శాడిస్ట్ భర్త గా నటించాడు. సత్యం రాజేష్ పోషించిన ఈ పాత్ర కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటికాలంలో సుధాకర్ విలన్ కామ్ కమెడియన్ పాత్రలు చేసేవాడు. ఇప్పుడు అదే దారిలో సునీల్, సత్యంరాజేష్ వంటి కమెడియన్స్ కూడా వెళ్తున్నారు. ఇక ఇద్దరితో పాటు ముందు ముందు ఇంకెంత మంది కమెడియన్స్ విలన్స్ గా ఆకట్టుకుంటారు చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: