తెలుగు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అభిమానాన్ని సంపాదించిన వారిలో హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక్కొక్క మూవీ కి 40 కోట్ల రూపాయల వరకు అనుకుంటున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై.. అధికార పార్టీ నేతలు చేసిన కామెంట్లు బాగా వైరల్ గా అనిపించాయి. ఈ విషయంపై నందమూరి ఫ్యామిలీ లో ఉన్న కొంతమంది స్పందించడం జరిగింది.

అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. అయితే ఆయన స్పందించడం పై కొంతమంది టిడిపి పార్టీ అధికారులు మాత్రం ఆయనని ఘోరంగా విమర్శిస్తున్నారు. ఇక టిడిపి అధికారులు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసుకొని కొన్ని మాటలు అనడం వల్ల, ఆయన అభిమానులు చాలా బాధపడినట్లు గా సమాచారం. ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియోలో వైసీపీ నేతలకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడారంటూ వాదనలు వినిపించాయి. దీంతో టిడిపి నేతలు మాత్రం ఎన్టీఆర్ ను తప్పుపడుతున్నారు.


అసలు జూనియర్ ఎన్టీఆర్ తో ఎప్పుడైనా ఆప్యాయంగా పలకరించారా, తనని మేనల్లుడు అనే విషయం అసలు గుర్తు ఉందా అంటూ ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కేవలం ఎన్టీఆర్ తన స్వతహాగా టాలెంట్ తో నే పైకి ఎదిగారని అభిమానులు తెలియజేస్తున్నారు. కేవలం రాజకీయం కోసమే ఎన్టీఆర్ ను వాడుకోవాలని చూస్తున్నారు అంటూ అభిమానులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.


ఒకానొక సమయంలో ఎన్టీఆర్ ప్రాణాలతో చెలగాటమాడి, ఆ మీద సానుభూతితో గెలవాలని చూసాడు అంటూ అభిమానులు తెలియజేస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఎన్టీఆర్ రాజకీయాలకు రాడనే ఉద్దేశంతోనే చేశారని ఆయన అభిమానులు కామెంట్లు రూపంలో వినిపించారు. అందుచేతనే మాట్లాడిన టీడీపీ నేతలంతా ఆయనకు క్షమాపణలు తెలపాలని కోరుతున్నారు అభిమానులు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా క్షమాపణలు తెలపాలని ఎన్టీఆర్  అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: