టాలీవుడ్
సినిమా పరిశ్రమలో ప్రతి ఐదు సంవత్సరాల కు ఒకసారి
హీరోయిన్ ల మధ్య పోటీ మారుతూ ఉంటుంది. ఒక
హీరోయిన్ ఐదు సంవత్సరాలు అగ్ర హీరోల తో సినిమాలు చేస్తూ ఇతర
హీరోయిన్ ల తో పోటీ పడి ఆ తర్వాత క్రమ క్రమంగా క్రేజ్ తగ్గించుకుంటూ వస్తుంది. ఏ
హీరోయిన్ విషయంలో అయినా ఇది తప్పకుండా జరుగుతుంది. ప్రస్తుతం
పూజా హెగ్డే టాలీవుడ్
సినిమా పరిశ్రమలో టాప్
హీరోయిన్ గా కొనసాగుతుంది.
రష్మీక మందన్నా,
రాశీ ఖన్నా ఆమెకు పోటీ ఇస్తుండగా ఓవైపు
కీర్తి సురేష్ కూడా ఆమెకు గట్టి పోటీ ఇస్తూ ఉండడం ఇప్పుడు ఆమెకు కొంత తలనొప్పిగా మారింద ని తెలుస్తోంది. పెద్ద హీరోలకు
పూజ హెగ్డే తప్ప మరో ఆప్షన్ కనబడడం లేదు. కొంతమంది బలవంతంగా రష్మీక మందన్నా ను తమ సినిమాల్లో పెట్టుకుంటున్నా అందరి చూపు
పూజా వైపే ఉంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని
పూజా హెగ్డే పెద్ద హీరోల సినిమాలకే ఎక్కువ కేటాయిస్తూ భారీ గా డబ్బు సంపాదించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.
అయితే ఇంకోవైపు
కీర్తి సురేష్ సైలెంట్ గా పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు పడుతూ ఆమెకు మంచి పోటీ ఇస్తుంది. దాంతో తన కెరీర్ ఎంతో బిజీగా సాగుతున్న క్రమం లో
కీర్తి సురేష్ ఈ విధంగా తన అవకాశాలకు గండి కొట్టడం ఆమెకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇద్దరూ కూడా అభినయం పరంగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటారు. అయితే గ్లామర్ విషయం లో మాత్రం పూజ ఎలాంటి పరిమితులు పెట్టుకోదు.
కీర్తి సురేష్ కొన్ని హద్దు లు పెడుతుంది. అయితే ఇంత గ్లామర్ ప్రదర్శించిన కూడా తనను పట్టించుకోకుండా ఆమె కు వెళ్లడం
పూజా హెగ్డే అభిమానులకు కూడా ఏ మాత్రం నచ్చదు.