ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుండి మహేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ బ్లాస్టర్ టీజర్ అందరి ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచింది.

ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సర్కారు వారి పాట మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే దీని తరువాత త్వరలో తదుపరి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు సూపర్ స్టార్ మహేష్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి కూడా థమన్ సంగీతాన్ని అందిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్లు యూనిట్ ఇటీవల అధికారికంగా ప్రకటించింది. అయితే రెండు రోజుల నుండి పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి పూజా హెగ్డేసినిమా నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు.

అయితే దానికి కారణం ఆమెకు ప్రస్తుతం వరుసగా ఆఫర్లు వస్తుండడమే అని, ఇప్పటికే రాబోయే ఏడాది డేట్స్ ని పలు ఇతత్ర సినిమాలకు కేటాయించిన పూజా మహేష్, త్రివిక్రమ్ ల సినిమాని వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని టాక్. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై నిర్మాతల నుండి అఫీషియల్ గా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయకతప్పదని అంటున్నారు విశ్లేషకులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: