ప్రగ్యా జైస్వాల్ తెలుగులో ఒకటి రెండు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేదు. తాజాగా నటసింహం బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించడానికి సిద్ధమైంది ఈ భామ. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రగ్యా జైస్వాల్ నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది . అంతేకాదు అలాంటి వాళ్ళు ఒక్కరే ఉంటారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.


బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న చిత్రం అఖండ. ఇక పోతే వచ్చే గురువారం అఖండ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు బోయపాటి శ్రీను.. ఇక సింహం, లెజెండ్ వంటి సినిమాలకు మించి ఈ సినిమా ఉండబోతోందని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్ బాలయ్య గురించి మాట్లాడుతూ.. బాలయ్య టైం అంటే టైం అని అప్పట్లో నేను 2,3 సార్లు కూడా కలిశాను అని ఆమె చెప్పుకొచ్చింది..


బాలయ్య బాబుతో కలిసి నటిస్తున్నాను తెలిసినప్పుడు కొంచెం నెర్వస్ గా ఫీల్ అయ్యాను..అయితే ఆయన కేవలం ఐదు నిమిషాల్లోనే నాతో బాగా కలిసిపోయారు.. ఇక ఆయన తో కూడా నేను చాలా కంఫర్ట్ గా ఫీలయ్యాను అంటూ ఆమె తెలిపింది. అంతేకాదు బాలకృష్ణ లాంటి గొప్ప పాజిటివ్ పర్సన్ ఇప్పటివరకు చూడలేదని ఆయన నడిచి వస్తుంటే సెట్ మొత్తం సైలెంట్ అవుతుందని ..క్రమశిక్షణ, సమయపాలన విషయంలో బాలయ్య బాబు చాలా గ్రేట్ అని తెలిపింది. ఈ సినిమాలో నా రోల్ కోసం ఎంతో కష్టపడ్డాను అని ఈమె తెలిపింది. ఉదయం 3 గంటలకు నిద్రలేచి 6 గంటలకు బాలయ్యబాబు సెట్ కి వస్తే, ఆ రోజంతా షూటింగ్లో పాల్గొంటారు మీరు మనిషేనా అని నేను అడిగితే బాలయ్య పవర్ ఫుల్ వ్యక్తి కావడం వల్లే బోయపాటి శ్రీను ఇలాంటి పాత్రలు రాసి ఉండొచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నట్లు ఆమె పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: