యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే, ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన రాదే శ్యామ్  సినిమా షూటింగ్ ను ఇప్పటికే ప్రభాస్ పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా తో పాటు ఆది పురుష్ సినిమా షూటింగ్ ను కూడా ప్రభాస్ పూర్తి చేశాడు. అయితే అది పురుష్  సినిమా పూర్తి అవగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కనున్న సలార్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడు అని అందరు అనుకున్నారు. కాకపోతే అనూహ్యంగా ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది, డిసెంబర్ 2 వ తేదీ నుండి ప్రాజెక్ట్ కే ను పట్టాలెక్కించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశాడు, ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబచ్చన్ పై సన్నివేశాలను తెరకెక్కించారు. డిసెంబర్ 2 వ తేదీ నుండి ప్రాజెక్టు కే షెడ్యూల్ ప్రారంభించి షెడ్యూల్ పూర్తయిన తర్వాత సలార్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కే సినిమాను వచ్చే ఏడాది చివరి వరకు పూర్తి చేసే ప్లాన్ లో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాను పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా లతో పాటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో 'స్పిరిట్' అనే సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: