ప్రముఖ టాలీవుడ్ దర్శకులు రాజమౌళి వైరల్ ఫీవర్ భారిన పడ్డారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ విషయం నిజమే జక్కన్న ఆరోగ్యం ఇపుడు కాస్త బాగోలేదు అని ఆయన సన్నిహితులు కూడా చెప్పినట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా ఈయన ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఆయన ఇంట్లోనే ఉంటూ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారట. కాగా ఇపుడు ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన పనులు తాను యధావిధిగా కొనసాగించవచ్చని తెలిపినట్లు అంటున్నారు. ఆయన ఆరోగ్యం బాగోలేనప్పటికీ పని రాక్షసుడు జక్కన్న తన పనులను చేసుకుంటున్నారట. నిజానికి "జనని" సాంగ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సమయంలో కూడా ఈయన ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది.

ప్రెస్ మీట్ లో జక్కన్న ఈసారి అంత హుషారుగా కనిపించలేదని, కాస్త నీరసంగా ఉన్నారని ఆయన ఫ్యాన్స్ కూడా అన్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని దాంతో మళ్ళీ ట్రిపుల్ ఆర్ పనుల్లో జక్కన్న మునిగి తేలుతున్నారు అని సమాచారం. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనుండగా ఫ్యాన్స్ అంతా తమ అభిమాన తారలను కలిసేందుకు, చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల అయిన సాంగ్స్ మరియు టీజర్ లు బాగా వైరల్ అవుతున్నాయి. జనని సాంగ్ కూడా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయింది.

ఇక పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం జనవరి 7 న సంక్రాంతి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఇద్దరు బడా స్టార్ లు కనిపించబోతున్నారు అనే విషయం అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: