తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంది. నందమూరి తారక రామారావు అలాంటి స్దాయిని కలిపించారు. ఇక ఆయన కడుపున పుట్టిన నందమూరి బాలకృష్ణ కూడా అటు సినిమాలోనూ..ఇటు రాజకీయాలోనూ తండ్రికి తగ్గ తనయుడిగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య నటించిన సినిమా "అఖండ" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఫుల్ మాస్ యాంగిల్ లో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను వచ్చే నెల 2న చిత్ర బృందం గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేస్తుంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య పక్కన అందాల భామ ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది. కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ప్రగ్యా జైశ్వాల్ ఆ సినిమాలో పద్ధతిగా కనిపించినా ఆ తరువాత మాత్రం యమ హీట్ పుట్టిస్తూ అవకాశాల కోసం తన బట్టల సైజులను పొదుపు చేసుకుంటూ వచ్చిన్నట్లు కనిపించింది. కానీ అఖండ సినిమాలో మాత్రం చాలా పద్దతిగా నటించిన్నట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పనులను స్పీడ్ అప్ చేసింది. ఈ క్రమంలో భాగం గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రగ్యా జైశ్వాల్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యులో పాల్గొనింది. ఈ టైంలో అమ్మడు సినిమా గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. అంతేకాదు బాలయ్య డెడికేషన్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించింది.

 ఇక ఇంటర్వ్యులో ఈమె సినిమా షూటింగ్ ఎలా జరిగిందనే దాని గురించి వివరిస్తూ.. బొయపాటి శ్రీను ను పొగిడేసింది. చాలా మంచి వారని, కొన్ని సీన్స్ ఇప్పటివరకు మీరు ఏ సినిమాలో కూడా చూసి ఉండరని చెప్పుకొచ్చింది. ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ..ఆయన ఉదయానే 3 గంటలకు నిద్రలేచి షార్ప్ ఆరు గంటలకల్లా సెట్స్ లో ఉండేవారని..అది చూసి ఆమె షాకై.." అసలు మీరు మనిషేనా..అని సరదాగా అడిగాను అని" చెప్పుకొచ్చింది. మరి చూడాలి అమ్మడుకి ఈ సినిమా ఎంత కలిసి వస్తుందో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: