సినిమా హీరోలు టీవీ షోలో హోస్టుగా చేస్తూ వారం వారం ప్రతి ఇంట సందడి చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. అక్కినేని నాగార్జున గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, రానా గారు, ఇలా చాలా మంది హీరోలు టీవీ షోలలో హోస్ట్ గా ఆకట్టుకుంటున్నారు. హిందీలో బాగా పాపులర్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి అనే షోలో అమితాబచ్చన్ గారు హోస్టుగా చేసిన విషయం అందరికీ తెలిసినదే, ఆ షో నే లే తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు .

 జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక వైపు సినిమాలు చేస్తూ మరొకవైపు టీవీ షోస్ విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఆయన ఇదివరకు బిగ్ బాస్ అనే రియాల్టీ షో కు హోస్ట్ గా చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక సార్ మా లో మొదట నాగార్జున గారు, తర్వాత చిరంజీవి గారు చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం  పేరు మార్చి ఇప్పుడు ఇంకొక ఛానల్లో ల ప్రసారం అవుతున్న విషయం మనకు తెలిసినదే, ఆ షోలో జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ గా  చేస్తున్న విషయం కూడా మనకు తెలిసినదే.
 
ఈ షోలో కొంత మంది సినీ ప్రముఖులు గెస్ట్ గా వచ్చి అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. మొదట గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గారు వచ్చారు, ఆ తర్వాత దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ కలసి వచ్చి సందడి చేశారు. బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గారు, సంగీత దర్శకులైన దేవి శ్రీ ప్రసాద్- తమన్ వంటి వారు గతంలో వచ్చి సందడి చేయడం మనం చూశాం . అయితే ఇప్పుడు ఈ గేమ్ షో కు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్ , ప్రోమోను కూడా మనం చూశాం. ఈ షో లో మహేష్ బాబు గారు ఎంత గెలుచుకున్నారు అనే ప్రశ్న ?అభిమానులకు ఆసక్తికరంగా మారింది. ఈ షోలో  మహేష్ బాబు గారు దాదాపు 25 లక్షలు గెలిచినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మొత్తాన్ని మహేష్ బాబు గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ కు డొనేట్ చేసినట్టు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: