ఖడ్గం సినిమాతో తనకంటూ ఒక ఒక గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్ పృథ్వి రాజ్. ఈ సినిమాలో నటించిన తరువాత కొన్ని సినిమాలలో కమెడియన్గా నటించి అంచెలంచెలుగా గుర్తింపు పొందుతూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు ఈ కమెడియన్. అయితే కొన్ని నెలల క్రితం పృథ్విరాజ్ వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. అందులో మనకి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అయితే పృథ్వి రాజ్ కి ప్రభాకర్ రెడ్డి ఆయనకు... ఆయన కెరియర్ కి ప్లస్ చేశారో మైనస్ చేశారో ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. పృథ్వి రాజ్ గండిపేట రహస్యం అనే ఒక సినిమాలో బాగా పెద్దాయన లాగా కనిపించే ఒక పాత్ర చేయాలని చెప్పారట.

అయితే  ఈ పాత్ర విషయానికి సంబంధించి గొడవ జరుగుతుందని అది ఇంత పెద్దగా అవుతుందని తను ఊహించలేదట. అయితే ఆ సమయంలో అయ్యప్ప స్వామి మాల లో ఉన్నారు పృథ్విరాజ్. అయితే ఈ వివాదం జరుగుతున్న సమయంలో ఆయన ఇంకా ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక సినిమా థియేటర్ కి బయలుదేరిన సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా వచ్చి వారిద్దరిని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్లారట. అదే సమయంలో హరికృష్ణ గారు అక్కడికి వచ్చి మాకు ఎంతో మేలు చేశారు... హరికృష్ణ పృథ్వి రాజ్ ని తన కారు ఎక్కాలని చెప్పి తనను ని అక్కడి నుంచి తీసుకు వెళ్ళి నట్టు ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో హరికృష్ణ అక్కడ లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు వారి పై దాడి చేసే వారిని చెప్పారు.

ఈ విషయం తర్వాత ఒక నాలుగు ఏళ్ళు ఆయన ఇబ్బంది పడ్డారని దాని తరువాత కూడా సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు తన ముక్కు చెవులను కోరుతామని బెదిరించినట్లు గా కూడా ఆయన పేర్కొన్నారు. ఆ పాత్రను సీనియర్ ఎన్టీఆర్ సీరియస్గా తీసుకోలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా సినిమాలతో పాటు ఆయన దూరదర్శన్ సీరియళ్లను కూడా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీని తర్వాత నువ్వు బ్రహ్మాండంగా పైకి వస్తావు అంటూ సీనియర్ ఎన్టీఆర్ పృథ్వి రాజ్ ని ఆశీర్వదించినట్లుగా ఆయన చెప్పారు. అయితే ఇది లాంటి సీనియర్ ఎన్టీఆర్ అంతిమయాత్ర లో భాగంగా ఆయన కెమెరాలను పట్టుకుని మొత్తం ఆయనే షూట్ చేసినట్లు దాని తర్వాత ఆయనకు షూటింగ్ ఆఫర్లు తగ్గడంతో మద్రాసు కూడా ఆయన వెళ్లినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం సినిమా ఆఫర్లతో ఆయన బిజీగా ఉండాలని తను ఇంకా తన అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: