ఈ సంవత్సరంలో కార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య బాబుతో కలిసి ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కొన్ని విషయాలను తెలియజేశాడు. బాలకృష్ణ అంటే ఒక ఎనర్జీ, ఒక విస్పోటనం అని తెలియజేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఒక మాస్ దేవుడు గా పేరు పొందారు బాలయ్య అని తెలిపారు. ఆయన సినిమా నిర్మిస్తున్న ఒక డైరెక్టర్గా నేను ఇక్కడికి రాలేదు.. ప్రజలలో అభిమానుల్లో ఒకడిగా ఇక్కడికి వచ్చానని తెలియజేశారు.


బాలకృష్ణ కు ఉన్న అభిమానుల బాలయ్యకు కూడా నేను పెద్ద అభిమానిని అని తెలియజేశారు. బాలక్రిష్ణ నటించిన సమరసింహా రెడ్డి మూవీ టికెట్లు దొరకకపోవడంతో రెండుసార్లు నేను గొడవ పడ్డాను. దాంతో నన్ను పోలీస్స్టేషన్లో ఒంగోలులో ఉంచారని తెలియజేశారు. ఇక డైరెక్టర్ బోయపాటి గురించి మాట్లాడుతూ.. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు అని తెలియజేశారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నానని, అలాగే జరగాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. నేను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం అని తెలియజేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్ ఎంతో అద్భుతంగా సంగీతం అందించాడని చెప్పుకొచ్చాడు.

నేను ఒక నెల రోజుల నుంచి ఎక్కడికి వెళ్లినప్పటికీ థమన్ సంగీతం అఖండ గురించి వినిపించేది అని తెలియజేశారు. బోయపాటి శ్రీను అప్పుడప్పుడు నెక్స్ట్ నువ్వే అని కూడా అనేవారు అని చెప్పుకొచ్చారు. అప్పుడు బాలయ్య అభిమానిగానే ఎంతో హ్యాపీగా ఫీలయ్యాను అని తెలియజేశారు. అఖండ సినిమాకు సంబంధించి ఫోటోలు వీడియోలు చూశాక అభిమానులకు కావాల్సింది  ఇలాంటి సినిమానే కదా అని అనుకున్నాను అని తెలియజేశారు. శ్రీకాంత్ కూడా బాగా నటించానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: