ఈ సందర్భంగా ఆయన మొదటి సారి రాసిన సినిమా పాట అనుభవం ఒకటి తెలుసుకుందాం. 1986 లో కె విశ్వనాద్ దర్శకత్వం లో 'సిరివెన్నెల' అనే సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు పాటల రచయితగా సీతారామశాస్త్రి గారు పనిచేశారు. ఈ సినిమాలో మొత్తం 9 పాటలు ఈయనే రాశారు. దానికి తోడు కేవి మహదేవన్ సంగీతం తోడవడంతో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఇందులో రాసిన ఒక పాట గురించి తమ అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో "విధాత తలపున ప్రభవించినది..." అనే పల్లవితో సాగే పాటను రచించడానికి వారం రోజులు పట్టిందట.
ఆ పాటను అంత కష్టపడి రాశారు కాబట్టి...ఈ పాట ఈ నాటికీ అందరి గొంతులో నానుతూ ఉంది. అలా ఆ పాటతో మొదలైన తన సినీ ప్రయాణం నేటికీ ఎంతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ సినిమాలో పాటలు అతనికి మంచి పేరు తెచ్చి పెట్టాయి. అందుకే ఈ సినిమా నుండి ఆయన పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారింది. ఆయన ఆరోగ్యం త్వరలోనే కుదుటపడి సంతోషంగా ఉండాలని కోరుకుందాం.