టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల కొరత చాలానే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద దర్శకులు పెద్ద హీరోల కాంబో లో సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ అందరికీ హీరోయిన్ గా ఒకరిద్దరు మాత్రమే ఆప్షన్ గా కనిపిస్తుండడంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ ల కొరత ఏర్పడిందని వారికి అర్థమవుతుంది. హీరో డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్ అయితే హీరోయిన్ కూడా అదే రేంజ్ లో క్రేజీ గా ఉండాలి.

ఒకటి రెండుసార్లు ఒకరిద్దరు హీరోయిన్ లతో సినిమాలు చేస్తున్నా కూడా అందరూ హీరోలు రెండు మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా చూస్తుండటంతో వారికి మళ్లీ అదే హీరోయిన్ లు ఆప్షన్ గా కనిపించడం ఒక సారి గా అందరినీ ఎంతగానో నిరాశపరుస్తుంది. తెలుగు తమిళ హిందీ భాషలలో హద్దులేని పెట్టుకోకుండా దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఆమె ఇప్పటికే అందరి స్టార్ హీరో లతో ఒక్కో సినిమా చేయగా ఇప్పుడు రెండో సారి వారితో నటిస్తుంది. 

మహేష్ బాబు తో రెండు సినిమాలు చేయగా ఇప్పుడు ఆమె త్రివిక్రమ్ తో మహేష్ చేయబోయే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా అనుకుంటున్నారు. అంతే కాదు నాగచైతన్యతో కలిసి ఆమె ఓ సినిమా లో నటించబోతుంది. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా చేయబోతుంది. ఇక ఈమె తర్వాత టాలీవుడ్ లో మరో ఆప్షన్ కనిపిస్తుంది రష్మిక మందన. ఆమె కూడా దాదాపు అందరు హీరోలతో ఒకసారి నటించే పనిలో ఉంది. ఆమె తర్వాత సాయి పల్లవి రాశి కన్నా లు మన మేకర్స్ కు ఆప్షన్స్ గా కనిపిస్తున్నారు. ఈ నలుగురు తప్పితే చాలా తక్కువ మంది హీరోయిన్ లు పెద్ద హీరోలతో నటించడానికి రెడీ గా ఉన్నారు. ఏదేమైనా ఒక హీరో నాలుగైదు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో ఈ నలుగురితో హీరోలు నెట్టుకు రావడం చాలా కష్టమనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: