వరుస విజయాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు దర్శకుడు
అనిల్ రావిపూడి. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం పటాస్ ఏ రేంజిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన చేసిన
రాజా ది గ్రేట్ మరియు
f2 చిత్రాలు కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకొని ఆయనను స్టార్ దర్శకుడిగా మార్చాయి. ఇక మహేష్ బాబు తో ఆయన చేసిన సరిలేరు నీకెవ్వరూ
సినిమా కూడా భారీ గా విజయవంతం కావడంతో ఒక్కసారిగా ఆయన పై అందరి హీరోల కన్ను పడింది.
ఆ క్రమంలోనే ఇప్పుడు
ఎఫ్2 సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు
అనిల్ రావిపూడి. ఈ చిత్రం తర్వాత ఆయన నందమూరి
బాలకృష్ణ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తూ ఉండగా తాజాగా ఈ లిస్ట్ లోకి
చిరంజీవి కూడా వచ్చి చేరాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య
సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
చిరంజీవి కొరటాల
శివ కాంబో లో వస్తున్న ఈ
సినిమా తర్వాత
మోహన్ రాజా, మెహర్ రమేష్ బాబీ లతో కలిసి సినిమాలు చేస్తున్నాడు.