మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తూ ఆరు పదుల వయసులో కూడా రాక్ స్టార్ వలే దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాల షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. ఇకపోతే ఆచార్య సినిమాను విడుదల చేయడానికి సరైన తేదీ కుదరక ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చివరికి జనవరి నెలలో విడుదల చేస్తామని ప్రకటించారు.. నిజానికి ఈ సినిమా 2019 అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభం కాగా, ఫోటోగ్రఫీ 2020 జనవరిలో ప్రారంభం అయింది.


కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయినా మొదట్లో 2021 మే 13వ తేదీన ఎలాగైనా సరే విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. కానీ భారతదేశం మొత్తం మహమ్మారి ఉండడంతో ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే డిసెంబర్ లో కూడా పాన్ ఇండియా మూవీ పుష్పా సినిమా వస్తున్న తరుణంలో కలెక్షన్లకు ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనలో ఉన్న డైరెక్టర్లు ఈ సినిమాను ఫిబ్రవరి 4 2022వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఆచార్య సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కించడమే కాకుండా యూత్ ని బాగా ఆకర్షించే నేపథ్యంలో తెరకెక్కించినట్లు సమాచారం.

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అలాగే కొన్ని ప్రొడక్షన్ కంపెనీ వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోగా చిరంజీవి,  రామ్ చరణ్ నటిస్తున్నారు. చరణ్ కి జోడీగా పూజ నటిస్తూ ఉండగా, చిరు కి జోడిగా కాజల్ నటిస్తున్నారు.డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు కానీ కరోనా 3ర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. అంతేకాదు మరికొద్ది రోజుల్లో లాక్డౌన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.కాబట్టి ఇక ఈ సినిమా విడుదల చేయడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: