స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లు ఉన్నాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఆ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాంటి సినిమాలో "పరుగు" సినిమా కూడా ఒకటి. 2008 మే 1 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా హీలా కౌర్ నటించింది. నాన్న మాట జవదాటని కూతురుగా.. లేచిపోయిన అక్కను తిట్టుకునే చెల్లిగా.. షీలా యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది. పరుగు సినిమా హిట్ అయినా అమ్మడుకి పెద్ద గా అవకాశాలు రాలేదు. కొన్ని ఆఫర్లు వచ్చిన అమ్మడు రేంజ్ ను పెంచలేకపోయాయి.

అల్లు అర్జున్‌తో ‘పరుగు’ సినిమా తరువాత హీలా కౌర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘అదుర్స్’ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో హీలా పాత్ర చాలా చిన్నది. దీంతో సినిమా హిట్ అయిన అమ్మడుకి ఉపయోగం లేకుండా పోయింది. ఇక యంగ్ హీరో రామ్‌తో ‘మస్కా’ సినిమాలో నటించిన జనాలు ఈమె పై పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో  ఈ ముద్దుగుమ్మను దర్శక నిర్మాతలు మెల్లగా దూరం పెట్టేసారు. ఇక  ఆఫర్స్ తగ్గిపోవడంతో షీలా తెర పై కనిపించనే లేదు.  చివరిగా ఈ బ్యూటీ బాలయ్య ‘పరమవీర చక్ర’ సినిమాలో నటించింది. మొత్తంగా తెలుగులో పాటు కన్నడ, మళయాలంలో 25కిపైగా సినిమాల్లో నటించింది షీలా కౌర్.

ఇలా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీలా కి క్యాన్సర్ ఉందట. వచ్చిన ఆఫర్స్ తోనే నెట్టుకొస్తున్న షీలా క్యాన్సర్ బారిన పడటం వల్లే పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా  క్యాన్సర్ కు అన్నీ రకాల ట్రీట్ మెంట్ తీసుకుంటున్న షీలా ఇంకా కోలుకోలేదట. ఇప్పటికి  క్యాన్సర్ తో పోరాటం చేస్తోందని సన్నిహిత వర్గాల వారు చెబుతున్నారు. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే.. క్యాన్సర్ బారిన పడినప్పటికీ షీలా ఎవరి హెల్ప్ తీసుకోకుండా తన లైఫ్ ను తానే మ్యానేజ్ చేసుకుంటుందట.ఒక్కప్పుడు హీరోయిన్ గా అందరిని ఆకట్టుకున్న షీలా ఇప్పుడు సూపర్ మార్కెట్ పెట్టుకొని తన ఖర్చులకు డబ్బులు సంపాదించుకుంటుందట. తనకు ఒకరి దగ్గర సహాయం తీసుకోవడం ఇష్టం లేదట.  ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ పై పోరాటం చేస్తాను అంటూ షీలా ధైర్యంగా చెప్పుకొస్తుందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: