ఈ నేపధ్యంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ అఖండ సినిమాను చాలా సీరియస్గా తెరకెక్కించారని ఈ సినిమాలో బాలకృష్ణ దాదాపుగా మూడు పాత్రల్లో కనబడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ కాస్త ఎక్కువగా కష్టపడటం కాకుండా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి అన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అని అంటున్నారు. గతంలో కంటే ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువగా పెట్టారని దీంతో నందమూరి బాలకృష్ణ కూడా ప్రమోషన్ కి సంబంధించి అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాలంటున్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా విషయంలో ఏ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి ఏంటి అనే దానిపై కూడా అందరిలో ఉత్సాహం నెలకొంది. అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాకు సంబంధించి బాలకృష్ణను వసూళ్లు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ సినిమాను చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ కాస్త బాగానే ఉన్నా సరే వైరస్ తీవ్రత కారణంగా అభిమానులు థియేటర్ కు వచ్చే పరిస్థితి ఉంటుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.