మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస  సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే, చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేశాడు. ఆచార్య సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు, ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమా తో పాటు తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా షూటింగ్ లో కూడా చిరంజీవి పాల్గొంటున్నాడు, ఈ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది, ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే సంజయ్ దత్ కు కథను వినిపించగా దానికి సంజయ్ దత్ కూడా ఓకే చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి, మరి ఇప్పటి వరకు ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలా ఇప్పటికి ఒక సినిమా షూటింగ్ ని పూర్తి చేసి, మరో రెండు సినిమా షూటింగ్ లను చక చక పూర్తి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వం లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: