మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా వరుసగా సినిమాలు విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్న సరే కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురు కావడంతో సినిమా విడుదల అదేవిధంగా షూటింగ్ కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే చిరంజీవి మధ్య కాలంలో తన సినిమాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా గతంలో కంటే సినిమాలను ఇప్పుడు వేగంగా పూర్తి చేయాలని దాదాపు పదేళ్ళపాటు సినిమాలను వేగంగా పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అంటున్నారు.

తన శారీరక సామర్థ్యం విషయంలో కూడా ఆయన కాస్త జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారని గతంలో కంటే కూడా ఫిట్నెస్ మీద ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టారని వ్యాయామం కూడా ఎక్కువగా చేస్తున్నారని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఆ తర్వాత ఒక మలయాళ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి చిరంజీవి గతంలో ఎన్నడూ లేనివిధంగా శ్రద్ధ పెట్టడం అలాగే నిర్మాత రామ్ చరణ్ కూడా చిరంజీవి విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి.

ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత వేసవిలో ఒక సినిమాను అలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. 2022 సంక్రాంతి ప్రస్తుతం చేసే సినిమాలు విడుదల చేయగా 2023 సినిమాకి మలయాళం రీమేక్ అని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు చిరంజీవి మాత్రం కాస్త దూకుడుగా ముందుకు వెళ్లడం సినిమాల నిర్మాణం విషయంలో జోక్యం చేసుకోవడం వంటివి అభిమానులను సంతోష పెడుతున్నాయి. మరి చిరంజీవి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందనేది ఏంటి అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: