తెలుగులో కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్ళడమే కాకుండా అగ్ర హీరోల సినిమాల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ రెమ్యూనరేషన్ కి సంబంధించి నిర్మాతలను ఇబ్బంది కూడా పెడుతున్నారు అని ప్రచారం ఈ మధ్యకాలంలో జరుగుతోంది. కీర్తి సురేష్ గతంలో కంటే కూడా ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడమే కాకుండా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటోందని తెలుస్తోంది.

గతంలో అందాలు చూపించే విషయంలో కీర్తి సురేష్ ఒకటికి పదిసార్లు ఆలోచించిన సరే ఇప్పుడు మాత్రం ఆలోచించడం లేదని ఐటం సాంగ్స్ కూడా చేయడానికి సిద్ధం అవుతోందనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. అయితే ఇప్పుడు మాత్రం కీర్తి సురేష్ తాను చేసే సినిమాలకు సంబంధించి తన సొంత రాష్ట్రంలో ఎక్కువగా ప్రమోషన్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తోందని ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాతలు కూడా తన సోషల్ మీడియా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలు అక్కడ విడుదల అయినా సరే తన సొంత టీమ్ తో ప్రచారం చేస్తానని కూడా చెప్పినట్లుగా సమాచారం.

అంతేకాకుండా తమిళనాడులో కూడా ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేసుకుంటాం అని చెప్పినట్లుగా కూడా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటనేది తెలియకపోయినా తెలుగులో టాప్ హీరోయిన్ పాత్ర కోసం ఆమె కాస్త ఎక్కువగా కష్టపడుతోంది అని ఈ నేపథ్యంలోనే ఈ విధంగా ప్లాన్ చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కీర్తి సురేష్ రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సరే ఈ రెండు మూడు సినిమాలకు సంబంధించి ఎప్పుడు విడుదల అవుతాయి ఏంటనే దానిపై క్లారిటీ లేదు. మరి భవిష్యత్తులో కీర్తి ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: