వరుస సినిమాలతో ప్లాపులలో ఉన్న
హీరో నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్.
సాయి పల్లవి మరియు కృతి శెట్టి
మడోన్నా సెబాస్టియన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ
సినిమా కి టాక్సీ వాలా ఫేం
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తుండగా తొలి
సినిమా తో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై
వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండగా
కలకత్తా నేపథ్యం లో పీరియాడికల్ యాక్షన్ డ్రామా గా ఈ
సినిమా తెరకెక్కింది.
హీరోయిన్
సాయి పల్లవి తో కలిసి
నాని చేస్తున్న రెండో
సినిమా కావడంతో తొలి
సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో
నాని రెండు విభిన్నమైన పాత్రలలో నటించబోతున్నారని తెలుస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు కోల్ కతా లో జరగాల్సి ఉండగా కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ అక్కడ చేయలేకపోయారు. అయితే
హైదరాబాద్ లోని పది ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఏడు కోట్ల రూపాయలతో భారీ సెట్ నిర్మించి అందులో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
కథ మీద ఎంత నమ్మకం లేకుంటే ఈ చిత్రాన్ని వారు ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు అని అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న విషయాన్ని చాటి చెప్పాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈమధ్యే విడుదల కాగా అది ప్రేక్షకులను ఎంతగానో
ఖుషీ చేస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఓ పాట ఇప్పటికే
యూట్యూబ్ లో రికార్డు ల మీద రికార్డులు సృష్టిస్తుంది. మీసకట్టు తో సరికొత్త పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తూ ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెంచుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.