అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రం డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం మొదటి భాగం ఇప్పుడు విడుదల కాబోతుండగా రెండో భాగం వచ్చే వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడం అందులోనూ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం కావడం తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమాకు విడుదల అవ్వడానికి ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఒక్కసారిగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. దానికి తగ్గట్లే అల్లు అర్జున్ గత నెల రోజుల నుంచి ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమా గురించి ఆయన హాజరవుతున్న అన్ని సినిమా వేదికలలో మాట్లాడుతూ ఈ చిత్రానికి ఫ్రీ గా  పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ గెస్ట్ గా వెళ్లి ఆ సినిమాల గురించి మాట్లాడటమే కాకుండా తన అభిమానుల కోసం తన సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఈ చిత్రంపై మరింత ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నాడు.

అయితే ఇది తెలుగులో పుష్ప సినిమాను బాగా ప్రమోట్ చేయడానికి వర్కౌట్ అవుతున్న హిందీలో మాత్రం ఎలా ఈ సినిమాను ప్రమోట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సూర్యవంశీ సినిమా విషయంలో ఓ కామెంట్ చేసి అక్కడ ప్రేక్షకుల అందరి అటెన్షn గ్రాబ్ చేసిన ఆయన ఇక ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకునే విధంగా చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే బాలీవుడ్ లో కొన్ని రోజులు ఉండి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా చేయాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా ప్రమోషన్ కి బన్నీ ఒక్కడే బాగా కష్టపడి పోతుండగా హీరోయిన్స్ మాత్రం ఇంకా షూటింగ్ లోనే ఉన్నారు. దాంతో సుకుమార్ కూడా బయటకు వచ్చి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడితే మంచిదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: