విజయ్ దేవరకొండ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తొలిసారిగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలపై పూరి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ కానున్నట్లు టాక్. రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తుండగా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కి చెందిన పలువురు ముఖ్య నటులు కీలక పాత్రలు చేస్తున్నట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్దమయిందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

రెండు రోజులుగా ఈ వార్త విస్తృతంగా ప్రచారం అవుతుండడంతో, ఇదే కనుక నిజం అయితే ఇప్పటికే అదే రోజున రిలీజ్ డేట్ ఇటీవల ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తో విజయ్ తలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై సినిమా యూనిట్ నుండి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినిమా విశ్లేషకులు. కాగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పరిచిన లైగర్ రేపు రిలీజ్ తరువాత ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: