నేచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు తన అభిమానుల ఫ్యాన్ బేస్ ను పెంచుకోవడానికి పెద్దగ ప్రయత్నాలు చేయలేదు. టాప్ యంగ్ హీరోలు అంతా తమ అభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే అనునిత్యం వారి అభిమానులతో వారివారి స్థాయిలలో టచ్ లో ఉంటూ తమ అభిమానులకు తమ హీరో ఆప్తుడు అన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు.


అయితే ఈ విషయంలో ఎందుకో ఇప్పటి వరకు నాని పెద్దగా శ్రద్ధ పట్టలేదు. మారుతున్న పరిస్థితులలో తన సినిమాలకు టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రావాలి కాబట్టి ఈ విషయం నాని ఆలోచనలలోకి వచ్చి తన తీరును మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈమధ్య నాని భాగ్యనగరంలోని ఒక ప్రముఖ కమ్యూనిటీ హాల్ లో తన అభిమానుల కోసం ఒక ఘనమైన విందు కార్యక్రమం ఏర్పాటు చేసారు.


రకరకాల ఆంధ్రా తెలంగాణ వంటలతో ఏర్పాటు చేసిన ఈ ఘనమైన విందుకు తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 4 వేల మందికి పైగా అభిమానులు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఆ విషయాలను పట్టించుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో నాని అభిమానుల సందడి కొనసాగినట్లు తెలుస్తోంది. సుదూర ప్రాంతం నుండి వచ్చిన తన అభిమానులను నాని ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడమే కాకుండా వారికి తానే స్వయంగా కొన్ని స్వీట్స్ ను సర్వ్ చేసినట్లు తెలుస్తోంది.


అంతేకాదు క్రిస్మస్ సీజన్ లో విడుదల కాబోతున్న తన ‘శ్యామ్ సింగ్ రాయ్’ సినిమా విశేషాలను తన అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన అభిమానులతో సెల్ఫీలు తీయించుకుని తెగ హడావిడి చేసాడట. ఎప్పుడు అభిమానులను పట్టించుకోని నాని ఈవిధంగా మారిపోవడానికి ఈమధ్య విడుదలైన తన లేటెస్ట్ సినిమాలు పరాజయం చెందడంతో అభిమానులలో తన క్రేజ్ తగ్గిపోకుండా ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు నాని అనుసరిస్తున్న ఈ కొత్త వ్యూహం ‘శ్యామ్ సింగ్ రాయ్’ ఎంతవరకు సక్సస్ ను ఇస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: