బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్,పూర్ణ హీరోయిన్ లుగా తొలి కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ మూవీకి డైరెక్టర్ గా బోయపాటి శ్రీను వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 2వ తేదీన బ్రహ్మాండంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో నిన్నటి రోజున పూర్ణ మీడియాతో ముచ్చటించింది. అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా తెలియజేయడం జరిగింది. వాటి గురించి చూద్దాం.

పూర్ణ మాట్లాడుతూ..2008 వ సంవత్సరంలో సీమటపాకాయ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఈ మూవీలో నటించిన తర్వాత నాకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి అని తెలియజేసింది. నిజానికి ఈ పాత్రను వేరొక నటి చేయాల్సి ఉంది. నా అదృష్టమో ఏమో కానీ ఈ మూవీలో నటించడానికి అవకాశం వచ్చిందని తెలియజేసింది. అఖండ మూవీలో తాను పద్మావతి అనే క్యారెక్టర్ లో నటించానని తెలిపింది.

ఈ క్యారెక్టర్ బాలకృష్ణ గారికి, విలన్ శ్రీకాంత్ కి మధ్య ఉండేటువంటి పాత్ర అని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా బోయపాటి సినిమాలో మహిళలకు చాలా విభిన్నమైన పాత్రలు ఉంటాయి. హీరోయిన్ తో సమానంగా పాత్రలు ఉండేలా చూస్తారు అని చెప్పుకొచ్చింది. బాలకృష్ణ గారి ముందు ఒక డైలాగ్ చెప్పాలంటే చాలా భయం వేసింది అని తెలిపింది.

నాకు డాన్స్ బాగా వచ్చినప్పటికీ, నాతో డాన్స్ చేయించాలంటే డైరెక్టర్లు మొహమాట పడతారు.. కానీ ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ ని ఒప్పుకోనని తెలియజేసింది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పులు చేస్తూ ఉంటారు.. అలా నేను కూడా ఒకసారి చేశానని తెలియజేసింది. పాత్ర నచ్చితే ఎలాంటి వాటికైనా ఒప్పుకుంటాను.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా ధరిస్తానని చెప్పుకొచ్చింది. అందుచేతనే షూటింగ్ సెట్ లోకి వెళ్ళిన తర్వాత డైరెక్టర్లను ఇబ్బంది పెట్టానని తెలియజేసింది. ఆ కారణంగానే ఒక సినిమాను చేశానని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: