తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు చాలా మంది హీరోలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండటం పట్ల కాస్త ఆసక్తి గల చర్చలు జరుగుతున్నాయి. గతంలో చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారి నా సరే కొన్ని కొన్ని అనుభవాల దృష్ట్యా వాళ్ళు చాలా వరకు సైలెంట్గా ఉండి పోయారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం కొంత మంది హీరోలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధం కావడం ఈ మధ్య కాలంలో కాస్త హాట్ టాపిక్ గా మారిన అంశంగా చెప్పాలి. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో నిర్మాతగా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ నిర్మాతగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఈ నేపథ్యంలోనే ఒక చిన్న సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. సాయిధరమ్ తేజ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడని ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ తో కలిసి వరుణ్ తేజ్ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి శ్రీకాంత్ అడ్డాల ఒక కథ కూడా సిద్ధం చేశారని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయవచ్చని అంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి వరుణ్ తేజ ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను ఒక టీం కి అప్పగించారని ఒక మీడియా సంస్థ దీనికి సంబంధించి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళుతుందని సమాచారం. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే తెలియకపోయినా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు వరుణ్ తేజ్ కాస్త ప్లాన్ చేస్తున్నాడని దీనికి సంబంధించి దర్శకుడు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ చ్చిందని సాయి ధరమ్ తేజ్ కూడా అప్పుడే ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: