హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సందీప్ కిషన్ హీరో గా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటంతో రకుల్ ప్రీత్ సింగ్ కు తెలుగు సినిమా పరిశ్రమలో క్రేజీ సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ టాప్ హీరోల సరసన చేరిపోయింది, రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ్, హిందీ సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం  రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కంటే బాలీవుడ్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తుంది, బాలీవుడ్ లో కూడా ఈ ముద్దు గుమ్మకు మంచి సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.

ఇలా బాలీవుడ్ జనాలకు కూడా అలరిస్తున్న రకుల్ ప్రీతి తాజా గా ఏ రంగం లో అయినా కరెక్ట్  గా ప్లానింగ్ చేసుకుంటే ఎదగవచ్చు అనేది వాస్తవమే , కానీ సినిమా ఇండస్ట్రీ లో మాత్రం అది కుదరదు.. ఎందు కంటే సినిమా ఇండస్ట్రీ లో రోజు రోజుకు పరిణామాలు మారుతూ ఉంటాయి , వాటికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అని రకుల్ ప్రీత్ సింగ్ తెలియజేసింది. ఇది ఇలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య నే పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కొండపొలం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ లో విజయాన్ని సాధించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: