ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎం.వి.రఘు దర్శకత్వం లో వచ్చిన సంచలన చిత్రం కళ్ళు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరాలందించారు. ఈ సినిమాలో కీలక సమయంలో వచ్చే పాట కోసం సిరివెన్నె ల సాహిత్యాన్ని సిద్ధంగా ఉంచుకున్నారు . ఆ పాటను విన్న బాలసుబ్రమణ్యం మీరే స్వయంగా ఈ పాట పాడితే బాగుంటుందని సలహా ఇచ్చారట.
దీంతో సిరివెన్నెల మీరు ఉండగా నేను ఎలా పాడతాను అని చెప్పారు అంట. చివరకు బాలసుబ్రమణ్యం ఒత్తిడి చేయడంతో పది సార్లు ప్రాక్టీస్ చేసి ఆ పాటను ఆయనే స్వయంగా పాడారు. ఈ పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట ఇప్పటకీ తెలుగు ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచి పోయింది. సంవత్సరాలు జరుగుతున్నా ఈ పాట ఓ సెన్షేషన్.
ఈ పాట గురించి ఓ సందర్భంలో ప్రస్తావించిన సిరివెన్నెల ఈ పాటను నా తమ్ముడు బాలసుబ్రమణ్యం ని పాడమని తాను ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదని.... చివరకు ఆయన ఒత్తిడి చేయడంతో నేను ధైర్యం చేసి పాడానని.. ఆ తర్వాత ఆ పాట సూపర్ హిట్ అయిందని ఓ సందర్భంలో చెప్పారు.