యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, అయితే ఇందు లో భాగంగా ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రాదే శ్యామ్ సినిమా షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేశాడు, ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 14 వ తేదిన విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటం తో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది. కొన్ని రోజుల క్రితం వరకు సైలెంట్ గా ఉన్న రాదే శ్యామ్ చిత్ర బృందం ఒక దాని తర్వాత ఒక అప్డేట్ ను బయటికి వదులుతూ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

కొన్ని రోజుల క్రితమే రాదే శ్యామ్ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా దీనికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది, ఆ తర్వాత కొంత కాలానికి ఈ రాతలే అనే ఒక లిరికల్ వీడియో సాంగ్ న్యూ చిత్ర బృందం ఒక బయటకు వదిలింది, ఈ పాటకు కూడా జనాల నుండి మంచి క్రేజ్ వచ్చింది. ఇలా టీజర్ ఒక లిరికల్ సాంగ్ తో జనాలలో ఫుల్ అంచనాలను క్రియేట్ చేసిన రాదే శ్యామ్ చిత్ర బృందం ఈ మధ్యే ఆషీకీ ఎగాయి అనే సాంగ్ టీజర్ ని బయటికి వదిలింది, ఈ టీజర్ తోనే సాంగ్ పై మంచి అంచనాలే క్రియేట్ చేసిన చిత్ర బృందం తాజా గా ఈ పూర్తి లిరికల్ సాంగ్ ను సోషల్ మీడియా వేదికగా బయటకు వదిలింది. ఈ సాంగ్ అదిరిపోయే లొకేషన్ లలో ప్రభాస్, పూజ హెగ్డే ల మధ్య చిత్రీకరించారు. మరి  ఈ పాట మరిన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: