నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం డిసెంబర్ 2వ తేదీన విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అంటే రేపు గ్రాండ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలయ్య కెరీర్లోనే అతిపెద్ద బడ్జెట్ తో నిర్మితమై న ఈ చిత్రం నందమూరి అభిమానులతో పాటు చిత్ర యూనిట్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. మాస్ దర్శకుడిగా బోయపాటి శ్రీను కు టాలీవుడ్ లో మంచి పేరు ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం కూడా మాస్ ప్రేక్షకులను గట్టిగా మెప్పిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ చిత్రం భారీ స్థాయిలో రేపు విడుదల కాబోతు ఉండగా ఇప్పటి వరకు చిత్రం నుంచి వచ్చిన అప్ డేట్ లు అన్నీ కూడా సినిమా యొక్క స్థాయిని రెట్టింపు చేసే విధంగా ఉన్నాయి. ఏకంగా 500కు పైగా స్క్రీన్లలో ఈ చిత్రం రేపు విడుదల కాబోతు ఉండగా ఇప్పటివరకు సెకండ్ లాక్ డౌన్ లో లవ్ స్టొరీ తర్వాత ఈ స్థాయిలో విడుదలైన చిత్రాలు లేకపోవడం విశేషం. ఏదైతేనేం లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు సినిమా థియేటర్ల లోకి రావడానికి ఇష్టపడని సమయంలో ఇంతటి స్థాయిలో ఈ సినిమా విడుదల కావడం వారిలో కొంత ఆసక్తిని కలిగిస్తుందా అనేది చూడాలి. 

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తుండగా ఆయన సంగీతం అందించిన ఈ సినిమా లోని జై బాలయ్య అనే పాట ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.  ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో నటిస్తుండగా అన్ని పాత్రలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి అని చెబుతున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ చేసిన నటన హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు. మరి నందమూరి బాలకృష్ణ హిట్ కొట్టి చాలా రోజులు అయిపోయిన నేపథ్యంలో ఈసారి చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: