నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు ప్రముఖ ఓటిటి ఆహా లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఇప్పటికే బాలకృష్ణ ఈ షో లో మొదటి ఎపిసోడ్ లో భాగంగా మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి లు గెస్ట్ గా వచ్చారు. వీరితో సరదాగా అనేక విషయాలను ముచ్చటించిన బాలకృష్ణ,  అనేక ఆటలను కూడా అనిపించాడు. ఇలా మొదటి ఎపిసోడ్ తోనే షో  పై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచిన బాలకృష్ణ ఆన్ స్టాపబుల్ షో కు నాచురల్ స్టార్ నాని గెస్ట్ గా వచ్చాడు, నానితో కూడా చాలా సరదాగా ముచ్చటించిన బాలకృష్ణ అనేక ఆటలను ఆడిస్తూ రెండవ ఎపిసోడ్ కూడా సూపర్ హిట్ చేశాడు. ఇలా రెండు ఎపిసోడ్ లు కూడా మంచి విజయవంతం అయిన తర్వాత బాలకృష్ణ చేతికి చిన్న గాయం కావడం వల్ల కొంత కాలం పాటు ఈ షో వాయిదా పడింది.

అయితే తాజాగా బాలకృష్ణ చేతి గాయం కాస్త తగ్గడం తో ఆన్ స్టాపబుల్ టాక్ లో మళ్ళీ మొదలైంది, ఈ మూడవ ఎపిసోడ్ లో భాగంగా ఆన్ స్టాపబుల్ టాక్ షో కు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడి గెస్ట్ లుగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆహా నిర్వహణ బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కి సంబంధించిన ఆన్ స్టాపబుల్ టాక్ షో డిసెంబర్ 3 వ తేదీ నుండి ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు కూడా ఆహార నిర్వహణ బృందం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇప్పటికే జరిగిన రెండు ఎపిసోడ్ లతో బాలకృష్ణ ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు, డిసెంబర్ 3 వ తేదీన మూడవ ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు బాలకృష్ణ రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: