టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్.. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. 14 రీల్స్, జి.ఎమ్.బి క్రియేషన్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మరియు టీజర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ఇటీవలే ఈ సినిమా ఓ భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ముందుగా అనుకున్నా..

 కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్ర యూనిట్. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదల కాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదిలా ఉంటే మహేష్ బాబు కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు మహేష్ బాబుకి ఓ మైనర్ సర్జరీ జరగబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వాయిదా పడుతుందని చెబుతున్నారు. ఇక మహేష్ బాబు కి సర్జరీ జరిగిన అనంతరం ఆయన కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోబోతున్నారట. 

ఇక సర్జరీ అనంతరం సుమారు రెండు నెలల తర్వాత మళ్లీ తిరిగి సర్కారు వారి పాట సినిమా షూటింగ్లో మహేష్ బాబు జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా మహేష్ ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు. ఇంత సడన్ గా మహేష్ బాబు కి సర్జరీ జరగడం ఏంటని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫాన్స్ ఇక సర్కారు వారి పాట సినిమా షూటింగ్ అనంతరం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.ఇక త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత మహేష్ సినిమాపై రాజమౌళి పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: