పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరో లుగా సాగర్ కె చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనున్ కొషియన్ సినిమా కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ మలయాళం సినిమాదే అయినప్పటికీ తెలుగు నేటివిటీ కి తగ్గట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా  నటిస్తున్నారు. ఇప్పటి కే ఈ సినిమా కు సంబంధించిన ప్రచార చిత్రాలను, టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయ గా వీటికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా, ఈ సినిమా పై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచే లా చేశాయి.

 ఇలా జనాలలో ఇప్పటికే ఫుల్ అంచనాలను  క్రియేట్ చేసిన ఈ సినిమా కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ కామెడీ హీరో గా ఓ వెలుగు వెలిగిన రాజేంద్ర ప్రసాద్ భీమ్లా నాయక్ సినిమా లో ఫుల్ సీరియస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ ఓ పెక్యులర్ పొలిటీషియన్ గా నటిస్తున్నారట. అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ సినిమా కి భీమ్లా నాయక్ రీమేక్ అన్న విషయం మనందరికీ తెలిసిందే, అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా లో ఈ పాత్ర ను అలెన్సియర్ లే లోపేజ్’ చేశారు. ఇలా భీమ్లా నాయక్ సినిమా లో రాజేంద్ర ప్రసాద్ పవర్ఫుల్ సీరియస్ పాత్ర లో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: