సినిమా ఇండస్ట్రీలో నైనా అగ్ర హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండడం సహజమే. అయితే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఐటమ్ సాంగ్ ల హవా విపరీతం గా నడుస్తోంది. ఈ ఐటమ్ సాంగ్స్ కి ప్రముఖ కొరియోగ్రాఫర్లు అదిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేసి ప్రేక్షకుల చేత ఈలలు కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా తన కొత్త సినిమాలోని ఓ పాట కోసం ఏకంగా బాలీవుడ్ నుంచి కొరియోగ్రాఫర్ దింపుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

 రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ వన్ డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన షూటింగ్ హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఇక ఈ పాటను చిత్రీకరించడం కోసం చిత్ర యూనిట్ ఒక మాస్ సెట్ కూడా ప్లాన్ చేశారు. ఇక మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పాట కోసం బాలీవుడ్ నుంచి తనకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ని తెచ్చుకున్నారు. ఇక గతంలో అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమా లోని 'గుడిలో బడిలో' అనే పాటకి ఆయనే కొరియోగ్రఫీ చేశారు.

 మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ పాట పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం అద్భుతమైన ట్యూన్ కూడా రెడీ చేశాడు. మరో రెండు రోజుల్లో ఈ పాట షూటింగ్ కూడా పూర్తి కాబోతోంది. ఇక సినిమాలో ఐటమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. దానికి తోడు ఈ పాటకి గణేశ్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారంటే ఈ పాటలో మరోసారి అల్లు అర్జున్ తన డాన్స్ తో ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెప్పవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: