పరాగ్ అగర్వాల్ ట్విటర్‌కి కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అది మొదలుకొని ఆయనకు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది. అంతేకాదు ఆయన సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండింగ్‌లో ఉంటున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ గాయని కూడా పరాగ్ కు శుభాకాంక్షలు తెలిపింది. అయితే నెటిజన్లు మాత్రం గతంలో వీరిద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ కన్వర్జేషన్ ను మరోసారి తెరపైకి తీసుకొస్తూ వైరల్ చేస్తున్నారు. పరాగ్ చిన్ననాటి స్నేహితురాలు, పాపులర్ బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్. ఆమె పరాగ్‌కి వచ్చిన కొత్త జాబ్ కోసం ట్వీట్ చేసి అభినందించారు. సోషల్ మీడియా వినియోగదారులు పరాగ్ అగర్వాల్, వారి మధ్య పాత సంబంధాన్ని వెలికి తీయడంతో స్నేహితులిద్దరి పాత ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

నెటిజన్ల ఈ చేష్టలకు శ్రేయ ఘోషల్ నవ్వుతూ మరోసారి ట్వీట్ చేసి తన స్పందనను తెలియజేసింది. శ్రేయ నవ్వుతూ 'హేయ్ మాన్, మీరు ఎన్ని చిన్ననాటి ట్వీట్లు తీస్తున్నారు! అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఇది 10 సంవత్సరాల క్రితంది అని శ్రేయ చెప్పింది. ఆ సమయంలోనే ట్విట్టర్ ప్రారంభం అయ్యింది. అప్పుడు మేము చిన్నపిల్లలం. స్నేహితుల గురించి ఒకరికొకరు ట్వీట్ చేయరు. ఇదేం టైంపాస్ జరుగుతోంది? అంటూ ట్వీట్ చేసింది.

పరాగ్‌ని ట్విటర్‌కి కొత్త సీఈవో చేయడంపై శ్రేయా ఘోషల్ చేసిన ట్వీట్ తర్వాత 2010 సంవత్సరం నాటి పాత ట్వీట్‌ను సోషల్ మీడియా వినియోగదారులు కనుగొన్నారని, అందులో పరాగ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయమని శ్రేయ తన అనుచరులను కోరిందని తెలుస్తోంది. మే 23, 2010న శ్రేయ "హే ఆల్, ట్విట్టర్‌లో మరో చిన్ననాటి స్నేహితుడు దొరికాడు. ఆహార ప్రియుడు, సంచారి, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పండితుడు పరాగ్‌ని అనుసరించండి. నిన్న అతని పుట్టినరోజు వారిని విష్ చేయండి" అంటూ శ్రేయ విష్ చేసింది. ఆ సమయంలో శ్రేయ చేసిన ఈ ట్వీట్‌ను పరాగ్ అగర్వాల్ కూడా రీట్వీట్ చేశారు. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రేయ మీరు ట్విట్టర్‌లో చాలా ప్రభావం చూపుతున్నారు. మీ ట్వీట్ కారణంగా నా అనుచరుల నుంచి ట్విట్టర్ సందేశాలు వెల్లువెత్తాయి' అని ఆయన అన్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: