టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో 'అన్ స్టాపబుల్' అని టాక్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ఈ షోలో సెలబ్రిటీస్ తో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు. దీంతో ఆడియన్స్ ని ఈ షో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ టాక్ షోలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నాచురల్ స్టార్ నాని సందడి చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ రెండు ఎపిసోడ్ లకు ఆడియన్స్ నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక అతి త్వరలోనే మూడో ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది.

 కామెడీ కింగ్ బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడి మూడవ ఎపిసోడ్ కి గానూ హాజరుకానున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ టాక్ షో కి సంబందించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే బాలయ్య టాక్ షోలో మహేష్ బాబు సందడి చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు లేటెస్ట్ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీన బాలకృష్ణ, మహేష్ బాబు ఒకే వేదికపై కనిపించబోతున్నారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో ఈ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇక బాలయ్య మహేష్ బాబు అరుదైన కాంబినేషన్ కి సంబంధించి మరో రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ ని ఇద్దరు హీరోల అభిమానులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మరోవైపు నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ 'అఖండ' డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత బాలయ్య టాక్ షో కి మహేష్ హాజరు కాబోతున్నారని అంటున్నారు. దీంతో నందమూరి మరో రెండు, మూడు రోజుల్లో డబుల్ ట్రీట్ ఉండబోతోందని చెప్పవచ్చు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: